వారు రాకుంటే ఎన్టీఆర్ షో అంతేనా..?

నందమూరి తారకరామారావు ఇటీవల బుల్లితెర పై ఎవరు మీలో కోటీశ్వరులు అనే ఒక టాక్ షో ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక పోతే ఈ షో మొదలవడమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కర్టెన్ రైజర్ గా స్టార్ట్ అయింది. మొదటి షో తోనే మంచి విజయాన్ని అందుకున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం సెలబ్రిటీల తో మంచి క్రేజ్ ను పొందింది.. అంతే కాదు ఇందులో ఎన్టీఆర్ తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ వస్తున్నాడు.

 

ఇకపోతే సెలబ్రిటీ లు లేకుండా సామాన్య ప్రజలు ఆడుతున్న సమయంలో షో కి పెద్దగా టిఆర్పి రేటింగ్ రావడం లేదు. ఇక్కడ ఎన్టీఆర్ వాక్చాతుర్యం కూడా పనిచేయడం లేదనే చెప్పాలి. దీంతో రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ లను కూడా ఈ షోకి పిలిపించి, వారి ముచ్చట్లను అభిమానులకు తెలియజేశాడు ఎన్టీఆర్. అంతేకాదు తాజాగా ఈ షోకి సమంతా కూడా వచ్చి మంచి టిఆర్పి రేటింగును సాధించేలా చేసింది..

ప్రతి వారానికి ఒకసారి సెలబ్రిటీలు రావడం, షో యొక్క టిఆర్పి రేటింగ్ పెంచడం చేస్తూ ఉన్నారు..నిజానికి ఈ షోకి సెలబ్రిటీలు రాకపోతే టిఆర్పి రేటింగ్ రాదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. అంతే కాదు ఎన్టీఆర్ నిర్వహిస్తున్న ఈ టాక్ షో కి తప్పకుండా సెలబ్రిటీలు వస్తేనే మరింత క్రేజ్ పెరుగుతుందని టిఆర్పి రేటింగ్ కూడా సాధిస్తుందని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.