ఉప్పెన సినిమాతో హిట్ కొట్టాడు.. కొండపొలంతో లాస్ ఇచ్చాడు..?

ఉప్పెన సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో వైష్ణవ్ తేజ్. ఇక ఆ తర్వాత వచ్చిన కొండపొలం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి డైరెక్టర్గా క్రిష్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన విడుదలయి మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ని రాబట్టుకున్నప్పటికి పెద్దగా ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే..
1). నైజాం-98 లక్షలు.
2). సీడెడ్-44 లక్షలు.
3). ఈస్ట్-36 లక్షలు.
4). వెస్ట్-27 లక్షలు
5). ఉత్తరాంధ్ర-65 లక్షలు
6). గుంటూరు-39 లక్షలు
7). కృష్ణ-30 లక్షలు
8). నెల్లూరు-20 లక్షలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్లు కలుపుకొని 3.59 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా..3.90 కోట్లను వసూలు చేసింది.

ఇక ఈ సినిమా థియేటర్లు బిజినెస్ విషయానికొస్తే..7.75 కోట్లు కాగా.. ఈ సినిమా సక్సెస్ రాబట్టాలంటే 8 కోట్ల రూపాయలను రాబట్టాలి. కానీ ఈ సినిమా 3.90 కోట్లు మాత్రమే కాబట్టి. దీంతో బయ్యర్లకు నాలుగు కోట్లు నష్టాలు వచ్చింది.