టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవలె భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుని అక్కినేని ఫ్యామిలీ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్.. ఇప్పటికే గుణశేకర్ దర్శకత్వంలో `శాకుంతలం`ను పూర్తి చేసింది. అలాగే ఇటీవల మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్ను సైతం ప్రకటించింది.
ఇక త్వరలోనే బాలీవుడ్లోకి కూడా సమంత ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే సామ్ తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో సమంత.. ఆమె స్నేహితులు శిల్పారెడ్డి ఫ్యామిలీతో టగ్ ఆఫ్ వార్ ఆడారు. వాస్తవానికి ఈ వీడియోను శిల్పారెడ్డినే మొదట పోస్టు చేయగా, సమంత దాన్ని రీపోస్ట్ చేశారు.
అంతేకాదు, `ఫిట్ నెస్ అంటే పడిచచ్చే, పోటీతత్వానికి మారుపేరులా నిలిచే ఫ్యామిలీతో ఇలాంటి ఆటలు అస్సలు ఆడకూడదు. మనం ఏ మాత్రం నెగ్గలేం సరికదా, మనకు దెబ్బలు కూడా తగులుతాయి` అంటూ కామెంట్ పెట్టుకొచ్చింది. దాంతో సామ్ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.