ఇచ్చిన మాటను సమంత నిలబెట్టుకోలేకపోయింది. ప్రామిస్ ను బ్రేక్ చేసి అభిమానులను బాధ పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్న సమంత-నాగచైత్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకుని, అపై పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే ఈ రోజు సమంత-నాగచైతన్యల పెళ్లి రోజు. ఈ సందర్భంగా సమంత గత ఏడాది ఇదే రోజున చేసిన ఓ ఇన్స్టా పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. `నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్` అంటూ గత ఏడాది పెళ్లి రోజునాడు చైతుకు తనదైన శైలిలో విషెస్ తెలిపింది.
ఇప్పుడు ఈ పోస్టే వైరల్ అవుతోంది. ఏడాది క్రితం ఇంత అన్యోన్యంగా ఉన్న జంట ఉన్నట్టుండి విడిపోవడం ఏంటంటూ? నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే `ఎటువంటి పరిస్థితులలో అయినా కలిసే ఉందాం..` అని చైతూకి చేసిన ప్రామిస్ ను సమంత బ్రేక్ చేసేసిందంటూ ఆమె అభిమానులు వాపోతున్నారు.
https://www.instagram.com/p/CF_MKk0hj6P/?utm_source=ig_web_copy_link