నాగచైతన్య-సమంతలు విడిపోయారు. సినీ ఇండస్ట్రీలో ఇటువంటివి సర్వ సాధారణమే. అయినప్పటికీ టాలీవుడ్లో రొమాంటిక్ కపుల్గా గుర్తింపు పొందిన చైతు-సామ్లు విడిపోవడాన్ని సినీ తారలు, సన్నిహితులు మరియు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017, అక్టోబరు 7న పెళ్లి చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాల్లోనూ వీరి వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్.. ఇలా ప్రతి వేడుకలో సమంత, చైతన్య ధరించిన వస్త్రాలను ప్రముఖ డిజైనర్ క్రేశా బజాజ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ముఖ్యంగా సమంత తన పెళ్లిలో కట్టుకున్న చీర ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. ఆమె కాంజీవరం పట్టు చీరను ధరించింది. ఆ చీర నాగచైతన్య అమ్మమ్మ దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే సినీ నటుడు, టాలీవుడ్ బడా నిర్మాత దగ్గుబాటి రామానాయుడు భార్యది. ఆ చీరను రీ మోడలింగ్ చేసి.. పెళ్లిలో సమంత కట్టుకుంది. ఇందుకోసం రూ. 40 లక్షల వరకు ఖర్చు అయిందని టాక్.