టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ మధ్యే భర్త నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. స్పష్టమైన కారణాలు తెలియకపోయినా.. చైతు-సామ్లు తమ వైవాహిక బంధానికి పులిస్టాప్ పెట్టేశారు. ప్రస్తుతం ఎవరి దారుల్లో వారు బిజీ బిజీగా గడుపుతుండగా.. సమంత తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుందట.
అసలు విషయం ఏంటంటే.. `ది ఫ్యామిలీ మ్యాన్2` వెబ్ సిరీస్ లో నటించిన సమంత తనదైన నటనతో ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్ తర్వాత బాలీవుడ్ నుంచి సమంతకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే అప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్న సామ్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు చైతుతో సామ్ విడిపోయింది. ఈ నేపథ్యంలోనే మనసు మార్చుకున్న సమంత బాలీవుడ్పై ఫోకస్ పెట్టిందట.
అంతేకాదు, తన మొదటి బాలీవుడ్ సినిమాకి సైతం సంతకం చేసిందని.. దసరా రోజున ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంతో `శాకుంతలం`ను ఫినిష్ చేసిన సామ్.. కోలీవుడ్ లో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. మరియు మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా సామ్ చేతిలో ఉన్నాయి.