టాలీవుడ్ లో చిరుత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న అప్పటికీ ఆ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఆమె బాలీవుడ్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..ఆమె కొన్ని షూటింగ్ విషయాలను బయటపెట్టింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన విషయం పై మాట్లాడింది. 2018 లో తన ఫోటో ఒకటి మార్ఫింగ్ చేసి దానికి సెక్స్ టాయ్ ను జత చేశారని , ఆ సమయంలో తను ఇల్లీగల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు తెలిపింది..
ఎప్పట్లాగే ఆరోజు కూడా సెట్స్ పైకి వెళ్ళినప్పుడు.. అందరూ తనతో చాలా విచిత్రంగా ప్రవర్తించారని, ఎవరూ తనతో మాట్లాడలేదని ఏవో గుసగుసలు వినిపించాయని, అసలేం జరిగింది అని అడిగితే.. అప్పుడు ఒకరు తన దగ్గరికి వచ్చి చెప్పారు అని చెప్పింది.. ఇది ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది అని చెప్పడంతో షాకయ్యాను..అంతేకాదు నాకు ఎందుకు ఇలా జరుగుతోందని బాధపడ్డానని తెలిపింది.. అంతేకాదు అప్పటికి తన ఇంకా చాలా ఎంగేజ్ లో ఉన్నట్లు, ఇలా ఎందుకు చేస్తారని బాధపడినట్లు చెప్పుకొచ్చింది..ఇక నిజమేంటో తనకు మాత్రమే తెలిసినా ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదని ఆమె తెలిపింది.