మ‌హేష్-ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌..అది మ‌ళ్లీ వాయిదా..?!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్‌కు మ‌ళ్లీ బిగ్ షాక్ త‌గిలింది. అస‌లేం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్ర‌సారం అవుతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంతి తెలిసిందే. అయితే ఈ షోలో సామాన్యులే కాకుండా అప్పుడ‌ప్పుడు సెల‌బ్రెటీలు కూడా వ‌స్తుంటారు.

 మీలో ఎవరు కోటీశ్వరుడు ని ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చారు.

ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, స‌మంత‌లు స్పెష‌ల్ గెస్ట్‌లుగా రాగా.. వారి చేత ఎన్టీఆర్ త‌న‌దైన శైలిలో గేమ్‌ను ఆడించి ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశాడు. అలాగే ఈ షోకు మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు.. టీఆర్పీ రికార్డ్స్‌ బద్దలుకొట్టేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక చాలా రోజుల క్రిత‌మే ఈ స్పెష‌ల్ ఎపిసోడ్‌కి సంబంధించిన షూట్ కూడా పూర్తైంది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ఎపిసోడ్ ప్ర‌సారం కాలేదు.

Mahesh Babu is the next chief guest on Jr NTR's Evaru Meelo Koteeswarulu. See leaked pic - Television News

దసరా కే టెలికాస్ట్ కావల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. దాంతో దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న ఆ మోస్ట్ వాంటెడ్ ఎపిసోడ్ ప్ర‌సారం అవుతుంద‌ని.. పండ‌గ‌కు మ‌హేష్‌-ఎన్టీఆర్‌ల‌ను ఒకే స్క్రీన్‌పై చూడొచ్చ‌ని భావించారు అభిమానులు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. దీపావ‌ళి కూడా రాక‌పోవ‌చ్చ‌ని..మ‌ళ్లీ ఆ ఎపిసోడ్ వాయిదా ప‌డింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.