సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ల ఫ్యాన్స్కు మళ్లీ బిగ్ షాక్ తగిలింది. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్రసారం అవుతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న సంతి తెలిసిందే. అయితే ఈ షోలో సామాన్యులే కాకుండా అప్పుడప్పుడు సెలబ్రెటీలు కూడా వస్తుంటారు.
ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, సమంతలు స్పెషల్ గెస్ట్లుగా రాగా.. వారి చేత ఎన్టీఆర్ తనదైన శైలిలో గేమ్ను ఆడించి ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. అలాగే ఈ షోకు మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు.. టీఆర్పీ రికార్డ్స్ బద్దలుకొట్టేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక చాలా రోజుల క్రితమే ఈ స్పెషల్ ఎపిసోడ్కి సంబంధించిన షూట్ కూడా పూర్తైంది. కానీ, ఇప్పటి వరకు ఆ ఎపిసోడ్ ప్రసారం కాలేదు.
దసరా కే టెలికాస్ట్ కావల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. దాంతో దీపావళి కానుకగా నవంబర్ 4న ఆ మోస్ట్ వాంటెడ్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని.. పండగకు మహేష్-ఎన్టీఆర్లను ఒకే స్క్రీన్పై చూడొచ్చని భావించారు అభిమానులు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. దీపావళి కూడా రాకపోవచ్చని..మళ్లీ ఆ ఎపిసోడ్ వాయిదా పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.