పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన మల్టీస్టారర్ చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు.
కానీ, ఇంతలోనూ ఎవరూ ఊహించని విధంగా రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` జనవరి 7కు విడుదల అయ్యేందుకు ఫిక్స్ అయింది. దాంతో భీమ్లా నాయక్తో సహా సంక్రాంతి రేసులో ఉన్న మహేష్ సర్కారు వారి పాట(జనవరి 13), ప్రభాస్ రాధేశ్యామ్(జనవరి 14) చిత్రాలకు బిగ్ షాక్ తగిలినట్టైంది.
అయితే వీటిలో రాధేశ్యామ్ చిత్రం ఎలాగో పాన్ ఇండియా చిత్రం కావడంతో ఖచ్చితంగా అనుకున్న తేదీకే వచ్చేస్తుంది. ఇక ఎటొచ్చీ భీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలే మధ్యలో ఇరుక్కున్నాయి. వీటిలో ఏదో ఒకటి వెనక్కి తగ్గితే.. బాక్సాఫీస్ క్లాషస్ను కొంతలో కొంతైన తగ్గించవచ్చు. కానీ, భామ్లా నాయక్ మాత్రం తగ్గేదే లే అని అంటున్నాడు.
మొదటి నుంచి చెప్తున్నట్టుగా జనవరి 12నే భీమ్లా రిపోర్టింగ్ ఉంటుందని తాజాగా ఓ పోస్టర్ రూపంలో డేట్ ను మళ్ళీ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దాంతో మహేష్కే దెబ్బ పడనుందని, ఖచ్చితంగా సర్కారు వారి పాటనే వెనక్కి తగ్గుతుందని బలంగా టాక్ వినిపిస్తోంది.