ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు నటించిన తొలి సినిమా `నాట్యం`. రేవంత్ కోరుకొండ దర్శకత్వం ఈ చిత్రంలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
నిశ్రింకళ ఫిల్మ్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం అక్టోబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నాట్యం ట్రైలర్ను తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. డ్యాన్స్ తో ఈ సమాజంలోని ఆలోచనల్లో మార్పు తీసుకురాగలము అని నమ్మే ఒక కుటుంబం, దానికి అడ్డుపడే పరిస్థితులు, పెద్దలు… ఇలా రకరకాల అనుభవాలతో నాట్యం కథను రూపొందించినట్లు ట్రైలర్ బట్టీ అర్థం అవుతోంది.
డైలాగ్స్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి అదిరిపోయిన నాట్యం ట్రైలర్ నెటిజన్లు ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్గా మారింది. కాగా, ఈ చిత్రంలో సంధ్యా రాజు నటించడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించింది.