ముగ్గురు హీరోలతో మల్టీ స్టార్ అంటున్న బొమ్మరిల్లు భాస్కర్..?

బొమ్మరిల్లు సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ఉన్న సృష్టించుకున్నాడు భాస్కర్. అయితే ఇప్పుడు తాజాగా అఖిల్ కి కూడా ఒక మంచి ఇచ్చాడనే చెప్పుకోవచ్చు. ఈరోజు ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ డైరెక్టర్ ముగ్గురు హీరోల మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించాలని అనుకున్నాడట కానీ అది ఆగిపోయింది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది.

ఒంగోలు గిత్త సినిమా ప్లాప్ తర్వాత తనకి అన్ని రోజులు ఎందుకు గ్యాప్ వచ్చింది అనే విషయం చెబుతూ.. ముగ్గురు హీరోల మల్టీస్టారర్ సినిమా చేయాలనుకున్నాడు అందుకోసమే ఇంత లేట్ అయింది అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే దిల్ రాజు బ్యానర్లో వస్తున్నటువంటి ఆట సినిమా. ముందుగా ఈ సినిమా తమిళ్ లో నాటికల్ అనే సినిమాలో రానా, బాబి, సింహ చేశారు. ఇక ఇదే సినిమాని మలయాళంలో.. బెంగళూరు డేస్ పేరుతో.. దుల్కర్ సల్మాన్, ఫాహద్ ఫాజిల్, నవీన్ పౌలి. చేశారు

ఈ సినిమాని తెలుగులో అయితే.. ఎన్టీఆర్, నాగ చైతన్య, వేరొక హీరోని పెట్టి చేద్దాం అనుకున్నారట బొమ్మరిల్లు భాస్కర్. ఈ కథ కోసం భాస్కర్ కొన్ని రోజులు వరకు కూడా చేయడం జరిగిందట. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా వర్క్ ను నిలిపివేశారు. అయితే ఈ వార్త ఇప్పటివరకు పుకారు గానే నిలిచిపోయింది. అయితే ఈ విషయం ఇప్పుడు బయటకు చెప్పారు భాస్కర్. కానీ ఈ సినిమా అయిపోవడానికి ముఖ్య కారణం వారికి ఖాళీ డేట్లు లేకపోవడమే అని చెప్పుకొచ్చాడు.