ఓటీటీ లో అలరించనున్న మగువ మజాకా సినిమా?

సంపత్ రాజ్ దర్శకత్వంలో డీఎస్ రావు, రవీంద్ర నారాయణ్ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘మగువా మజాకా’. ఊర్వశి ఓటిటి సమర్పణలో భీమవరం టాకీస్ సహకారంతో నిర్మించారు.అయితే ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం.ఈనెల 8 నుంచి ఊర్వశి ఓటిటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాను ఫణిరాజు నిర్మించారు. ఈ సినిమాకు పి ఎస్ సంగీతాన్ని అందించారు.

ఒక మగువ తనపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుల పట్ల ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా దర్శకుడు సంపత్ నంది కి మంచి పేరును తెచ్చి పెడుతుందని, ఈ నెల 8న ఊర్వశి ఓటీటీ లో ఈ మగువా మజాకా సినిమాను విడుదల చేస్తున్నాం అని నిర్మాత పణిరాజ్ తెలిపారు. మగువా సినిమా తో సంచలనం సృష్టించిన మధుప్రియ ఈ సినిమాతో మధుప్రియ మజాకా అనిపిస్తుందని దర్శకుడు సంపత్ నంది పేర్కొన్నారు.