నరేష్ వల్లే మా శ్రేయస్సు కుంటుపడుతూ వచ్చింది.. ఉత్తేజ్?

టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఇటీవల కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే. కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఇటీవలే మరణించిన విషయం మన అందరికి తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా జరిగిన మా ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా ఎన్నిక అయిన ఉత్తేజ్ తనను గెలిపించిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన భార్య పద్మ చనిపోయిన కారణంగా తాను ఎవరినీ ఓటు అడగలేదని, కానీ తన మీద ప్రేమతో 300 ఓట్లు వేసి తనను జాయింట్ సెక్రటరీగా గెలిపించారని ఉత్తేజ్ తెలిపారు.

భిన్నాభిప్రాయాలకు అవకాశం లేకుండా తాము తప్పుకుంటున్నామని ఉత్తేజ్ అన్నారు. పోలింగ్ రోజున నరేష్ యుద్ధవాతావరణం సృష్టించారని, తనని తన కుటుంబ సభ్యులను బండబూతులు తిట్టాడని పేర్కొన్నారు. కాకుండా నా భార్య పద్మ చనిపోతే చిరంజీవి, జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజు పలువురు హాస్పిటల్ వద్దనే ఉండి తనను ఓదార్చారని, కానీ నరేష్ మాత్రం ఫోన్ కాల్ కూడా చేయలేదని తెలిపారు . 25 ఏళ్ల కెరీర్లో బెనర్జీ అన్న ఏడవటం చూడలేదు. నరేష్ వల్లే మా శ్రేయస్సు కుంటూ పడుతూ వచ్చింది విష్ణు బాగా పని చేయాలని ఆశిస్తున్నాను అని ఉత్తేజ్ తెలిపారు.