మోహన్ బాబు బూతులు తిట్టాడని ఎమోషనల్ అయిన తనిష్?

తాజాగా జరిగిన మా ఎన్నికల తో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంచలనం చోటు చేసుకుంది. పాతికేళ్లకు పైగా ప్రస్థానం ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సంచలనం చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. మంచు విష్ణు కి ఇబ్బందులు ఉండకూడదనే తమ ప్యానల్ సభ్యులు రాజీనామా చేసినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు తనీష్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. మా ఎలక్షన్ పోలింగ్ రోజు మోహన్ బాబు తనను బూతులు తిట్టాడని ఎమోషనల్ అయ్యాడు.

ఎప్పుడూ కూడా మీడియా ముందుకు రాకుండా వివాదాలకు దూరంగా ఉన్నాను. నాకు ఓటు వేసిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. పుట్టినరోజు మోహన్ బాబు నన్ను బూతులు తిట్టారు. ఆపేందుకు ప్రయత్నించినా బెనర్జీని సైతం మోహన్ బాబు తిట్టిపోశారు. అప్పుడు మంచు విష్ణు మధ్యలో జోక్యం చేసుకుని మమ్మల్ని ఆపారు. మా అమ్మను కించపరిచే బూతులు మోహన్బాబు తిట్టారు. నాకు నా తల్లి సర్వస్వం. అలాంటిది ఆమెను తిడుతుంటే చాలా బాధేసింది. గతంలో కూడా వివిధ సందర్భాలలో నరేష్ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది అంటూ తనీష్ భావోద్వేగానికి లోనయ్యారు.