ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతున్న కీర్తి సురేష్.. ఫొటోస్ వైరల్?

మహానటి కీర్తి సురేష్ ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. అలాగే ప్రస్తుతం సినిమాలతో దూసుకుపోతోంది. ఈమె ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో హీరో మహేష్ బాబు సరసన నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుపుకుంటోంది. ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ ప్రస్తుతం ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతోంది. సరదాగా ఆమె ముంబై పర్యటనకు వెళ్లి విషయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

తన ఇంస్టాగ్రామ్ లో ది పర్ఫెక్ట్ మీట్ వీక్ మూడు అంటూ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో కీర్తి బ్లూ డెనిమ్స్, ఫుల్ స్లీవ్డ్ తెలుపు రంగు చొక్కాలో నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అలాగే వీకెండ్ కోసం ఎదురుచూస్తూ..అంటూ #Wednesdayvibes, #MumbaiDiaries హ్యాష్ ట్యాగ్ లను జత చేసింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంటే ముంబైలో ఏం చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సర్కారు వారి పాట సినిమాలో కాస్త విరామ సమయం దొరకడంతో తన స్నేహితులతో కలిసి అలా సరదాగా గడిపేందుకు ముంబై వెళ్లినట్లు సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం.