ఉత్తేజ్ భార్య సంతాప సభలో కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి?

టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఇటీవల కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే. కొద్ది రోజులుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఇటీవలే మరణించారు. తాజాగా ఉత్తేజ్ భార్య పద్మ సంస్మరణ సభ హైదరాబాద్ ఫిలింనగర్ ఎస్ఎన్ సిసి క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తేజ్ కుటుంబ సభ్యులతో పాటుగా ఇండస్ట్రీలో నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే ఉత్తేజ్ ను ఓదార్చి.. భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగబాబు, శ్రీకాంత్, మురళీమోహన్, రాజశేఖర్, హేమ, అలాగే దర్శకుడు శివ నాగేశ్వర రావు తో మరికొంత మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అక్కడ చిరంజీవి ని చూడగానే ఉత్తేజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు. చిరంజీవి ని పట్టుకొని ఉత్తేజ్ బోరున విలపించాడు.

ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. జీవితంలో ఎలాంటి బంధం అయినా విడిపోయినప్పుడు.. దూరం అయినప్పుడు కాలంతోపాటు మర్చిపోగలం కానీ భార్యాభర్తల మధ్య మాత్రం అలా కాదు అన్నారు చిరంజీవి. భార్య భర్తలు అంటే ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారని.. ఇందులో ఏ ఒక్కరు దూరమైన కూడా జీవితాంతం ఆ లోటు తప్పదంటూ ఉత్తేజ్ భార్య పద్మ గారి మరణాన్ని ఉద్దేశించి చిరంజీవి తెలిపారు. అలాగే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చిరంజీవి కోరారు.