`వరుడు కావలెను` మొద‌ట ఏ హీరో వ‌ద్ద‌కు వెళ్లిందో తెలుసా?

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య‌, రీతూ వర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది. ఫస్ట్ లుక్‌, గ్లింప్స్‌, టీజర్‌, ట్రైల‌ర్‌ల‌తో భారీ అంచ‌నాల‌ను ఏర్ప‌ర్చుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 29న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

Varudu Kaavalenu' is for all sections of audience: Director Lakshmi Sowjanya - News - IndiaGlitz.com

ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌యోజ‌న్స్ నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగానే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ద‌ర్శ‌కురాలు లక్ష్మీ సౌజన్య.. ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. దాదాపు 15 సంవత్సరాలు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. ఇక ఇలాగే ఉంటే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానే ఉండిపోతానేమోనని ‘వరుడు కావలెను’ కథ రాసుకుని దర్శకురాలిగా మారాను.

Naga Chaitanya replaces Vijay Devarakonda

∙2017లో ‘వరడు కావలెను’ సినిమా స్టోరీలైన్‌ను నిర్మాత చినబాబుకు చెప్ప‌గా.. ఆయ‌న‌కు నచ్చింది. ఆ తర్వాత పూర్తి కథ తయారు చేస్తే..ఓకే అన్నారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల సినిమా ఆలస్యమైంది. ఇక తొలిక ఈ సినిమా స్టోరీని నాగ చైత‌న్య‌కు చెప్పాను. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆయ‌న రిజెక్ట్ చేశారు. ఆ త‌ర్వాత శౌర్య‌కు వినిపించ‌గా.. ఆయ‌న‌కు బాగా నచ్చి వెంట‌నే ఓకే చెప్పారు. ప్రకృతి ఎంత ప్లెజెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. కుటుంబంతో కలిసి హాయిగా ఆస్వాదించ‌వ‌చ్చు` అంటూ లక్ష్మీ సౌజన్య చెప్పుకొచ్చారు.