నందమూరి బాలకృష్ణ పోటీ మార్కెట్లోకి సరికొత్త గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం చాలా రోజుల నుంచి బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏదైనా వెబ్ సిరీస్ తో షాక్ ఇస్తాడు అనుకుంటే ఆయన ఎవరూ ఊహించని విధంగా ఒక డిఫరెంట్ షోతో సిద్ధమవుతున్నారు. అనే అన్ స్టాపబుల్ అనే ఆహా షోకు రాబోయే గెస్ట్ ఎవరు అనే విషయం పై ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
అయితే మొదటి ఎపిసోడ్ ను దీపావళి సందర్భంగా విడుదల చేయబోతున్నారని వార్త బాగా వినిపిస్తోంది. మంచు మోహన్ బాబు తో బాలకృష్ణ మొదటిసారిగా ఈ షోలో పాల్గొన్న పోతున్నట్లుగా సమాచారం. కొద్ది రోజుల కిందటే ఈ షో ని లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇదే తంతు లోనే అల్లు అరవింద్ ఒక ప్లాన్ సిద్ధం చేసినట్లుగా సమాచారం.
మోహన్ బాబు తో మొదలు పెట్టే ఆ ప్రత్యేకమైన ఎపిసోడ్ ను దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు గా తెలుస్తోంది. కేవలం ఇందులో సినీతారలు కాకుండా దర్శక నిర్మాతలను కూడా పాల్గొంటారు అన్నట్లుగా తెలుస్తోంది. ఇక మెగాస్టార్ రామ్ చరణ్, చిరంజీవి వంటి వారు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తోంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో అనే విషయం మరో కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.