ఏపీ రాజకీయాలపై ఆర్జివి సెటైర్.. వైరల్..?

వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. రాజకీయాల్లో ఉండే వారు బాక్సింగ్ నేర్చుకోవాలి అంటూ తెలియజేస్తున్నాడు. ఈ రోజున మన తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశాడు.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తే అక్కడున్న నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం వంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది అంటూ ఆర్జీవి వెటకారంగా తెలియజేశాడు. దీనిపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ విషయంపై కూడా ఒక సినిమా తీయండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై అల్లరిమూకలు దాడితో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది సంగతి అందరికీ తెలిసిందే. బుధవారం రోజున తెలుగుదేశం పార్టీ బంధు నిర్వహించింది. ఇదే క్రమంలో ని అటు టిడిపి ఇది వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇక దీంతో ఈ పరిణామం ఇంకా ఎంత వరకు వెళుతుందో వేచిచూడాల్సిందే.

https://twitter.com/RGVzoomin/status/1451043233467809795?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1451043233467809795%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ffilmyfocus.com%2Ftelugu%2Frgv-sarcastic-tweet-on-ap-politics%2F