సాయి పల్లవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఫిదా` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ న్యాచురల్ బ్యూటీ.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తెలుగు వారిని తన బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత సెలెక్టివ్గా సినిమాలను ఎంచుకుంటూ.. వరుస హీట్లతో దూసుకుపోతోంది.
ఈమె నటించిన లవ్ స్టోరి చిత్రం కూడా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ వయసు 30 ఏళ్లకు చేరువవుతోంది. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందా అని ఆమె అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో ప్రముఖ జ్యోతిష్కులు లో ఒకరైన వేణు స్వామి సాయి పల్లవి జాతకం గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వ్యక్తిగతంగా సాయిపల్లవి జాతకంలో పెను సంచలనాలు నమోదవుతాయని వేణుస్వామి తెలిపారు. ముఖ్యంగా వివాహాహం అనంతరం ఆమెకు అనేక ఇక్కట్లు ఎదురవుతాయని.. వాటి వల్ల దేశవ్యాప్తంగా సాయిపల్లవి పేరు వినిపిస్తుందని వేణుస్వామి అన్నారు. అలాగే ఆమె మనసు చిన్న పిల్లల మనస్తత్వం అని, దగ్గర వాళ్లతో ఆమె తరచూ గొడవలు పడుతుందని.. అందుకే ఆమెతో జాగ్రత్తగా ఉండాలని వేణుస్వామి చెప్పుకొచ్చారు.