ఎస్పీ బాలు చివరగా ఆలపించిన పాట ఏదో తెలుసా?

గాన గాంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. తన మధుర స్వరంతో ఎన్నో పాటలు పాడిన ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆయన మరణించాడు అన్న వార్తను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్పీ బాలు చనిపోయి ఏడాది అవుతున్నా కూడా అతడి జ్ఞాపకాలు ఇంకా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే హీరో రజినీకాంత్, దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలు శ్రోతలను అలరించాయి.

వీరిద్దరి కాంబినేషన్ లో మరొక పాట అన్నాత్తే సినిమా అక్టోబర్ 4న శ్రోతల ముందుకు రానుంది. రజినీకాంత్ ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక అదే పాటను ఎస్పీ బాలసుబ్ర పాడితే ఆ పాట ఇంకా ప్రత్యేకం. ఎస్పీబీ అలాంటి లెజెండ్ తో ఓ పాటను రికార్డ్ చేయడం నా లక్ అని అన్నారు సంగీతదర్శకుడు ఇమ్మాన్. మరి ఈ పాట ఎలా ఉండబోతోంది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి. నా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు ఖుష్బూ, మీనా,కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.