సినీ నటుడు అల్లు రామలింగయ్య.. ఈ పేరు తెలియని వారుండరు. తనదైన కామెడీతో మూడు తరాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన.. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో వందల పాత్రలకు ప్రాణాన్ని పోసిన అల్లు రామలింగయ్య జయంతి నేడు.
ఈ సందర్భంగా అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు తాత అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తగా హైదరాబాద్ లో అల్లు రామలింగయ్య పేరున నిర్మిస్తున్న స్టూడియో ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. అనంతరం నివాళులు అర్పించిన అల్లు బ్రదర్స్.. తాత విగ్రహం పక్కన నిల్చుని ఫొటోకు పోజిచ్చారు.
ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన బన్నీ..`ఈ రోజు మా తాత పద్మశ్రీ రామలింగయ్య గారి జయంతిన వారి విగ్రహాన్ని ఆవిష్యరించాము. ఈ కార్యక్రమంలో నాతో పాటు వెంకటేశ్, శిరీష్ పాల్గొన్నారు. ఆయన మా గర్వకారణం, అల్లు స్టూడియోస్ నిర్మాణ ప్రయాణంలో తోడుగా ఉంటారు` అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దాంతో ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్గా మారాయి.