అఖిల్ పెళ్లి అలా ఆగిపోయింది.. చైతన్య జీవితం ఇలా మారిపోయింది.. అక్కినేని భవిష్యత్తు ఏంటో?

ప్రస్తుతం టాలీవుడ్ లో మన్మధుడు నాగార్జున కుమారుల వివాహ జీవిత విషయం చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా ఆ వార్తలు నిజం చేశారు సమంత,నాగ చైతన్య. అవును మేము ఇద్దరం విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ వివాహ విషయం కూడా తెరపైకి వచ్చింది. అక్కినేని అఖిల్ పెళ్లి పెటాకులు కావడంపై చర్చ జరుగుతోంది.

ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే సంస్థల యజమాని మనవరాలు శ్రీయ భూపాల్ తో అఖిల్ వివాహం నిశ్చయమైన విషయం గురించి మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. వీరిద్దరి పెళ్లి పై చర్చ జరుగుతుండగా, ఏమైందో తెలియదు కానీ వీరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపించాయి. చివరికి ఆ వార్తలు నిజమయ్యాయి. ఇక ప్రస్తుతం సమంత నాగచైతన్య కూడా భార్యాభర్తల బంధానికి దూరంగా ఉండాలనుకుంటే నట్లు ప్రకటించడం గమనార్హం. దీనితో అక్కినేని కుటుంబంలో పెళ్లి వందల పై సర్వత్రా చర్చకు దారితీసింది.