వెంకీతో జాతిరత్నాలు దర్శకుడు.. త్వరలోనే సినిమా?

దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు సినిమా ఇంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు అనుదీప్. ఈ సినిమా తర్వాత అనుదీప్ కు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఇక తన తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నారు అన్న విషయం పై క్లారిటీ ఇవ్వని అనుదీప్, ఇటీవల స్టార్ హీరో అయినా విక్టరీ వెంకటేష్ కి కథ వినిపించాడట. కామెడీ పండించడంలో మన స్టార్ హీరోలలో ముందుంటాడు మన వెంకీ మామ.

ఆ కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా లభించే వెంకీ మామ, అలాగే కామెడీ సినిమాలను ఎంపిక చేసుకునే అనుదీప్ వీరిద్దరి కలయికలో సినిమా వస్తే ఇక ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వాల్సిందే. అనుదీప్ ఈసారి కూడా కామెడీ ని  నమ్ముకుంటున్నాడట. ఇక తన కామెడీ కథకు హీరో వెంకటేష్ అయితే న్యాయం చేయగలరని భావించి ఆయనకు కథ వినిపించాడట. ప్రస్తుతం ఆ కథను తీర్చిదిద్దే పనిలో ఉన్నారట. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత వెంకీ మామ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకని వెంటనే అధికారికంగా ప్రకటిస్తారు.