డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు హాజరైన హీరో తరుణ్?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ చివరి దశకు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు ఈడీ అధికారులు 11 మంది సినీ సెలబ్రిటీలు విచారించారు. అయితే నేడు టాలీవుడ్ డ్రగ్స్ విచారణ కేసులో భాగంగా హీరో తరుణ్ ఇది అధికారులు ముందుకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హీరో తరుణ్ ఇప్పటికే ఈది కార్యాలయానికి చేరుకోగా, తరుణ్ ను ఈడి అధికారులు మనీలాండరింగ్, అలాగే ఫెమ యాక్ట్ ఉల్లంఘన పై విచారించనున్నారు. అంతేకాకుండా ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అయిన కెల్విన్ తో సంబంధాలు, బ్యాంకు లావాదేవీలపై ఈడీ విచారించనుంది.

2017 లో ఎక్సైజ్ విచారణను తరుణ్ ఎదుర్కొన్న విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ కేసులో సెలబ్రిటీల పై బలమైన ఆధారాలు లేవని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ తేల్చి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. నీ సెలబ్రిటీల పై కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని,కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలు గా భావించలేమని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తరుణ్ లకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈడి పరిధిలోకి తీసుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.