శిల్పాశెట్టి కుటుంబంపై మరో చీటింగ్ కేస్..!

ఫోన్ గ్రఫీ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.ఇక ఈ మధ్యనే బెయిలు మీద బయటకు వచ్చారు.ఈ గ్యాప్ లోనే రాజ్ కుంద్రా శిల్పాశెట్టి పై చాలా కేసులు నమోదయ్యాయినట్లుగా సమాచారం.ఇప్పుడు ఈ జంటపై తాజాగా మరో కేసు నమోదైంది.వ్యాపారం లో పెట్టుబడి పెడతానని చెప్పి తన దగ్గర నుంచి 41 లక్షలు రూపాయలను తీసుకొని మోసం చేశారంటూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త విశాల్ గోమొల్ పోలీసులను ఆశ్రయించారట.

ఆ డబ్బును వాళ్లు అడల్ట్ సినిమాలు తీయడానికి ఉపయోగించారని ఆరోపించాడు.వారి లాభాల కోసం చెట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో తెలియజేశాడు.ఇలా వీరు చాలామంది దగ్గర డబ్బు తీసుకుని వాటిని పోర్న్ వీడియోలు తీసుకునేందుకు ఉపయోగించారు అన్నట్లుగా ఆరోపణలు చేశాడు.దీని మీద ఇదివరకే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.

ఇక వీరితో పాటే నందన మిశ్రా, దర్శిత్ షా, ఎంకె మధ్యా, సత్య ద్ర సరుప్రియ, ఉమేష్ గోయంకా పేర్లను పేర్కొన్నారు.అయితే ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో.. సదరు వ్యాపారి ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు.వారు తదుపరి విచారణ నవంబర్ 9కి వాయిదా వేశారు.