తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో తొలి వారం పూర్తైంది. వంద రోజులు ఉంటానని ఆశతో వెళ్లిన 7 ఆర్ట్స్ సరయు.. ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయింది. అందరినీ దమ్దమ్ చేస్తానని హౌస్లోకి అడుగు పెట్టిన ఈ భామ.. కన్నీళ్లతో ఇంటి సభ్యులకు వీడ్కోలు పలికింది. ఇక ఆపై స్టేజ్ మీదకు వచ్చిన సరయు కొందరు కంటెస్టెంట్స్కు తనదైన స్టైల్లో ఇచ్చిపడేసింది.
కంటెస్టెంట్లలో బెస్ 5 మెంబర్స్, వరెస్ట్ 5 మెంబర్స్ గురించి నాగ్ చెప్పమనగా.. శ్వేత, మానస్, ప్రియాంక, విశ్వ, హమీద పేర్లును చెప్పుకొచ్చింది. ఇక వరస్ట్ కంటెస్టెంట్లుగా సిరి, షణ్ముఖ్, లహరి, సన్నీ, కాజల్ను ఎంచుకున్న సరయు వాళ్ల గురించి చెప్తూ శివాలెత్తింది. ఈ క్రమంలోనే సిరి, షణ్ముఖ్ల గుట్టంతా రట్టు చేసేసింది.
సరయు మాట్లాడుతూ..సిరి, షణ్ముఖ్ ముందే ప్లాన్ చేసుకుని వచ్చారని, ఒకరిని ఒకరు లేపుకుంటూ ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారని తెలిపింది. అలాగే వీరిద్దరు చాలా క్లెవర్స్ . కానీ, వీరిద్దరూఒరిజినల్ గేమ్ ఆడటం లేడని తెలిపింది. ఇకపైనా సొంతంగా గేమ్ ఆడాలని సూచించింది. మొత్తానికి సరయు మాటల బట్టీ చూస్తుంటే.. సిరి, షణ్ముఖ్లు కలిసి గేమ్ ఆడుతున్నారని ప్రేక్షకులకు స్పష్టంగా అర్థమైపోయింది.