మహేష్ వర్సెస్ సంజయ్ దత్.. ఏం జరిగిందంటే?

మహేష్ బాబు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అతడు కలేజా లాంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మహేష్ బాబు మళ్లీ త్రివిక్రమ్ తో కలిసి ఒక సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

అయితే మరొక హీరోయిన్ కోసం నభా నటేష్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను సంప్రదించాలి అనే ఆలోచనలో ఈ సినిమా చిత్ర బృందం ఉందట. ఇప్పటికే కే జి ఎఫ్ చాప్టర్ 2 లో సంజయ్ దత్ విలన్ గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. సంజయ్ దత్ ఈ సినిమాలో రాజకీయనాయకుడు పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.