సాయి ధరంతేజ్ గురించి బాలకృష్ణ మాటల్లో..!

ప్రముఖ సుప్రీం సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రమాదంలో ఈ యువహీరో తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక ప్రస్తుతం ఈయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇక అంతే కాకుండా ఈయనకు కాలర్ బోన్ అనే శస్త్రచికిత్స కూడా ఈ రోజు మధ్యాహ్నం అపోలో వైద్యులు సక్సెస్ఫుల్ గా చేశారు చికిత్స.

ఇక ఈ ఆక్సిడెంట్ పై ప్రముఖ హీరో బాలకృష్ణ కూడా స్పందించారు.సాయి ధరంతేజ్ నా బిడ్డ లాంటివాడు సాయి ధరంతేజ్ త్వరగా కోలుకోవాలని మరి హీరోగా మన ముందుకు రావాలని నా ఇష్ట దైవాన్ని ప్రార్ధిస్తున్నాను అంటూ తెలియజేశాడు.అంతేకాకుండా నా ఇష్టదైవం నరసింహ స్వామి గుడిలో పూజ కూడా చేస్తున్నాను అన్నట్లుగా తెలియజేశాడు.

ఇక అంతే కాకుండా తన బాలకృష్ణ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా సాయి త్వరగా కోలుకోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అన్నట్లుగా తెలియజేశాడు బాలకృష్ణ. ఏది ఏమైనా బాలకృష్ణ ఇలా స్పందించడం ద్వారా బాలకృష్ణ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ హీరో అయిన ఆపద వచ్చినప్పుడు తన వెనక ఉండే వారే నిజమైన హీరో అన్నట్లుగా మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.