రకుల్ రిక్వెస్ట్ క్యాన్సల్ చేసిన ఈడీ..?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.ఇక అందులో సెప్టెంబర్ 6వ తేదీన విచారణకు హాజరుకావాలని రకుల్ ప్రీతిసింగ్ కు నోటీసులు పంపించింది ఈడి.కానీ అందుకు రకుల్ ప్రీతిసింగ్ నాకు కొద్దిగా గడువు కావాలని ఓ లేఖ ద్వారా తెలియజేసింది రకుల్ ప్రీతిసింగ్.

షూటింగుల్లో బిజీగా ఉండడం చేత తాను ఇప్పుడు హాజరుకావాలని..కొంత గడువు కావాలని ఈడి ని కోరుకుంది రకుల్.కానీ ఈ రిక్వెస్ట్ ను ఈడీ అధికారులు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఖచ్చితంగా సెప్టెంబర్ 6వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందే అన్నట్లుగా ఈడీ స్పష్టం చేసింది.

అమెరికా ఇక ఎప్పుడూ 4 సంవత్సరాల క్రితం డ్రగ్స్ కేసును మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ లో వెలికి తీయడం వల్ల చాలా సంచలనంగా మారింది ఈ విషయం.అయితే అప్పుడు అధికారులు తెలిపిన ప్రకారం..రకుల్ ప్రీతిసింగ్ పేరు లేదు కానీ ఇప్పుడు ఈడి ఎంక్వయిరీ లో ఆమె పేరు బయటకు రావడం గమనార్హం.ఇక ఇప్పటికే పూరి జగన్నాథ్ 11:00 విచారణ చేశారు ఈడి.ఇక ఈ రోజున నటి చార్మి ను కూడా అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.

ఏదిఏమైనా రకుల్ ప్రీతిసింగ్ ఈ విచారణకు హాజరవుతున్న లేదో వేచి చూడాల్సిందే.