రాధేశ్యామ్ రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా పూర్తయి చాలా రోజులు అవుతున్నా, ఇంకా రిలీజ్‌కు మాత్రం నోచుకోలేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతుందా లేదా అని ప్రేక్షకులతో పాటు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలో చిత్ర యూనిట్ నుండి మరోసారి చిత్ర రిలీజ్‌పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను ఏదేమైనా సంక్రాంతి బరిలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సంక్రాంతి బరిలో జననరి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో రాధేశ్యామ్ చిత్రం రిలీజ్ అవుతుందా లేదా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అటు పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కూడా రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో రాధేశ్యామ్ చిత్రం సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతుందా లేదా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక రాధేశ్యామ్ చిత్రం మరోసారి రిలీజ్‌ను వాయిదా వేసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు. మరి ఈసారైనా రాధేశ్యామ్ చిత్రం అనుకున్న సమయానికి వస్తుందా లేక చెప్పిన డేట్‌ను మిస్ చేస్తుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.