మహాసముద్రం టైలర్ పై ప్రభాస్ ప్రశంసల వర్షం?

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మహా సముద్రం సినిమా దసరా స్పెషల్ గా అక్టోబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దంగా ఉంది. ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా సినిమాను ఎకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.

అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మహాసముద్రం ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సినిమాలో అదితి రావు హైదరి,అను ఇమ్మ్యూన్యూయేల్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇందులో జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే హీరో శర్వానంద్, హీరో సిద్ధార్థ్ హీరోలుగా కనిపించబోతున్నారు.చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో సిద్ధార్థ్ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

ఇటీవల రిలీజ్ అయినా మహా సముద్రం ట్రైలర్‌కు అన్ని వర్గాల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ విడుదలైన రెండవ రోజు కూడా ట్రైలర్ యూట్యూబ్ టాప్ లో ట్రెండింగ్‌ అవుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ కు 6.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్ బాగుందంటూ ప్రశంసించారు.