దారుణంగా బూతులు మాట్లాడుతూ రాళ్లు విసిరారు: పోసాని వాచ్ మెన్ భార్య

సినీ నటుడు, రచయిత పోసాని మురళి కృష్ణ పవన్ కళ్యాణ్ వివాదం తగ్గడం లేదు. పోసాని కృష్ణమురళి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో పోసాని పై దాడికి ప్రయత్నించారు. అంతేకాకుండా అతని ఇంటిపై కూడా దాడి చేశారు. తాజాగా పోసాని కృష్ణ మురళి ని, ఆయన భార్యను పచ్చి బూతులు తిడుతూ పోసాని ఇంటిపై 12:00 రాళ్లతో దాడికి దిగారని పోసాని ఇంట్లో పనిచేసే వాచ్ మెన్ భార్య శోభ మీడియాకు తెలిపింది.

బుధవారం అర్ధరాత్రి పోసాని కృష్ణమురళి నివాసంపై రాళ్లతో దాడికి దిగారని, వారిలో ఇద్దరి వ్యక్తుల మాటలు గట్టిగా వినిపించినట్లు ఆమె తెలిపింది. పోసాని ఎనిమిది నెలలుగా ఈ దంపతులు నివసిస్తున్న ఈ నివాసంలో ఉండ లేదని ఆమె తెలిపారు.ఆ ఇంటిని తమకే అప్పగించి వెళ్లాలని ఆమె తెలిపింది.అయితే రాత్రి సమయంలో ఆమె ఆ ఇంటివద్దే నిర్వహిస్తామని తెలిపింది.

రెండు రోజులుగా పోసాని కృష్ణమురళి దూషిస్తూ కొందరు తిరుగుతున్నారని, గత రాత్రి పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారని, ఈ క్రమంలో భయమేసి మేము ఇంట్లో నుంచి బయటకు రాలేదు అన్నారు. చివరకు పురుషోత్తం అనే ఒక వ్యక్తి సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆమె తెలిపింది.