యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బుల్లితెరపై మరోసారి తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోను హోస్ట్ చేస్తూ తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు తారక్. ఇక ఈ షోకు టీఆర్పీ రేటింగ్స్ కూడా భారీగా వస్తుండటంతో ఈ షోను నెక్ట్స్ లెవెల్కు తీసుకెళ్లేందుకు నిర్వాహకులు వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రిటీలతో ఎవరు మీలో కోటీశ్వరులు షోను మరో లెవెల్కు తీసుకెళ్లేందుకు తారక్ కూడా రెడీ అయ్యాడు.
ఇప్పటికే ఈ షోలో స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, శివ కొరటాల గెస్ట్లుగా వచ్చి ప్రేక్షకులను అలరించారు. కాగా ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ను రంగంలోకి దించాడు తారక్. మహేష్ బాబుతో ఓ స్పెషల్ ఎపిసోడ్ను చేసి ప్రేక్షకులకు అందించేందుకు రెడీ అయ్యారు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ లాంటి షోలో పాల్గొనడం తనకు కూడా సంతోషంగా ఉందంటు మహేష్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఎపిసోడ్కు సంబంధించిన షూటింగ్ను నిర్వాహకులు ముగించేశారట. అన్నపూర్ణ స్టూడియోస్లో నిర్వహించిన ఈ షూటింగ్లో ఒకే వేదికపై ఎన్టీఆర్, మహేష్ బాబు కనిపించడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకలు అంటున్నారు.
ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ను దసరా కానుకగా టెలికాస్ట్ చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఆల్ టైమ్ టీఆర్పీని సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి తారక్ కోసం మహేష్ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఎలాంటి సందడి చేశాడనేది తెలియాలంటే మాత్రం దసరా వరకు ఆగాల్సిందే.