కొండపొలం ట్రైలర్: అడవిలో పోరాటం.. మందికై, మందకై..!

మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ తేజ్.. ఇక రెండవ సినిమా కొండ పొలం కూడా కొద్ది నిమిషాల ముందే..ట్రైలర్ కొత్తదనంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.ఈ సినిమా అటవీ నేపథ్యంలో సాగే గ్రామీణ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, ఓబులమ్మ సాంగ్ విడుదలై మంచి విశేష స్పందన లభించింది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదువుకున్న.. గొర్రెల కాపరులు కుటుంబానికి చెందిన కటారు రవీంద్ర యాదవ్ గా వైష్ణవ్ తేజ్ పరిచయం చేయడంతో కొండపొలం ట్రైలర్ ప్రారంభమైంది. ఇక జాబ్ కోసం ఎంత కష్టపడినా రాకపోవడంతో తిరిగి తన స్వగ్రామానికి వెళ్లిపోతాడు హీరో.

అలా కొండపొలం వెళ్ళిన తర్వాత అడవుల్లో మృగాలు మరియు మానవ మృగాల నుంచి తన గొర్రెలను కాపాడుకుంటూ హీరో ఎలా బతుకుతాడు అన్నదే ఈ సినిమా ట్రైలర్ లో చూపించారు. ఇక వైష్ణవి తేజ్ పక్కన ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీతిసింగ్ గొర్రెల కాపరిగా గ్లామరస్ లుక్ తో బాగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమా చూడాలంటే అక్టోబర్ 8 వరకు వేచి చూడాల్సిందే.