ఈడీ ముందు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్..

టాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీతిసింగ్ పై డ్రగ్స్ కేసులో తన పేరు ఉండటంతో ఆమె సెప్టెంబర్ 6వ తేదీన విచారణకు హాజరుకావాల్సి ఉంది.కానీ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం చేత ఇమే సెప్టెంబర్ 3 అంటే ఈ రోజున హాజరవుతానని రకుల్ మెయిల్ ద్వారా అధికారులను కోరిందట.దీనికి అధికారులు అనుమతి ఇవ్వడంతో రకుల్ నేడు విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక ఫైల్ ని పట్టుకొని తన టీంతో కలిసి ఈడి ఆఫీస్ కు వచ్చిన ఫోటోలు వైరల్ గా మారాయి.ఈరోజు ఉదయం 10:30 గంటలకు విచారణ రావాల్సిందిగా అధికారులు ఈడీ నోటీసులు పేర్కొనగా..ఈమె అధికారుల కంటే ముందే ఉదయం 9:10 ఆఫీస్ దగ్గరికి చేరుకుంది.

వాస్తవానికి 2017 లో ఎక్సైజ్ శాఖ జరిపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈమె పేరు లేదు కానీ ఇప్పుడు ఈమె పేరు ఉండడంవల్ల ఈ విషయం కాస్త పెద్ద చర్చగా మారుతోంది.కెల్విన్ సమాచారం మేరకు రకుల్ ప్రీతిసింగ్ కూడా మనీ లాండరింగ్ వ్యవహారంలో సంబంధం ఉందనే అనుమానంతో ఈడీ నోటీసులు పంపినట్లు తెలుపుతోంది. ఇదే తంతులో రకుల్ ప్రీతిసింగ్ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ను ఈడి పరిశీలించనుంది.కెల్విన్ కు రకుల్ ప్రీతిసింగ్ అకౌంట్ నుంచి ఏమైనా లావాదేవీలు జరిగాయని ఆరా