ఇండోనేషియాలో రీమేక్ అవుతున్న ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ ఇదే!

మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్ అయిన దృశ్యం మూవీ గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మరో రీమేక్ సిద్ధమవుతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా, మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమా దృశ్యం. ఇప్పటికే ఈ సినిమా భాషలు, సరిహద్దులు దాటి ఇస్తోంది. ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ మూవీ దృశ్యం. అంతేకాకుండా ఈ దృశ్యం సినిమా ఇప్పటికే నాలుగు భారతీయ భాషలు అలాగే రెండు విదేశీ భాషల్లో రీమేక్ అయింది. రీమేక్ అయినా ఈ చిత్రానికి అన్నిచోట్ల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే చైనీస్ భాష లోకి రీమేక్ చేసిన మొదటి మలయాళ సినిమా కూడా ఇదే.

దృశ్యం చిత్రం డిసెంబర్ 2013 లో విడుదల అయింది. 2014లో కన్నడ, తెలుగు రీమేక్ లో ఈ చిత్రం విడుదల అయ్యింది. 2015లో పాపనాశం తమిళంలో, అలాగే అదృష్టం పేరుతో హిందీలోనూ రీమేక్ మొదలయ్యాయి. చైనీస్ రీమేక్ చేసిన ఈ సినిమా కూడా 2019లో విడుదల అయ్యింది. అంటే దాదాపుగా ఈ సినిమా విడుదలైన ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇండోనేషియాలో రీమేక్ గా విడుదల కాబోతోంది. దృశ్యం చిత్ర నిర్మాత ఆంథోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని ఇండోనేషియాలోని అనుమతిస్తున్నట్లు ప్రకటిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈసినిమా ఇండోనేషియాలో జకార్తాలో పిటి ఫాల్కన్అనే సంస్థ నిర్మిస్తోందని ఆంథోనీ తెలిపారు.