పెను భూతంలా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుంటోంది.
గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. నిన్న కూడా రోజూవారి కేసులు 40 వేలకు పైగా నమోదు అవ్వగా..మరణాలు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్లో 45,352 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,03,289 కు చేరుకుంది. అలాగే నిన్న 366 మంది కరోనా కారణంగా మృత్యువాత పడగా.. దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,39,895 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 34,791 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 3,20,63,616 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్రస్తుతం 3,99,778 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, రోజూవారీ కేసుల్లో అత్యధిక కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదు అవుతున్నాయి. తాజా కేసుల్లోనూ 32,097 కేసులు కేరళ నుంచే వచ్చాయి.