సాయి తేజ్ ఆరోగ్యం బాగుంది.. మరో 36 గంటలు ఐసీయూలోనే?

హీరో సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం అతను అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయి తేజ మెల్లిమెల్లిగా కోరుకుంటున్నట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం రోజు సాయి ధరమ్ తేజ్ కి శస్త్రచికిత్స జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ వైద్యులు సాయి తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ మేరకు సాయి తేజ వెళ్లి మెల్లగా కోలుకుంటున్నారని, ఆదివారం కాలర్ బోన్ కు చేసిన ఆపరేషన్ విజయవంతం అయిందని తెలిపారు.

అంతేకాకుండా మొదటి ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది. సాయి తేజ్ కూడా డాక్టర్లు అందించే చికిత్సకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే సాయి తేజ్ ను ఇంకా 36 గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉంచాల్సి ఉంది అంటూ డాక్టర్లు తమ ప్రకటనలో పేర్కొన్నారు. బైక్ యాక్సిడెంట్ అయిన సమయంలో చాతి పై అలాగే కుడి కన్ను పై కూడా గాయాలు అయ్యాయి. ఏది ఏమైనప్పటికీ సాయి తేజ్ ప్రమాదం నుంచి కోలుకుంటూ ఉండడం ఆనందించాల్సిన విషయం.