టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఈ మధ్య తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. డెంగీ బారినపడిన ఆయన రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోవడంతో సెప్టెంబర్ 18న హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
దాంతో ఆయన అభిమానులు తె కంగారు పడిపోయారు. అడివి శేష్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాక్షించారు. అయితే తాజాగా అడివి శేష్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పాడు. గత కొన్ని రోజుల నుంచి హాస్పటల్లోనే చికిత్స తీసుకుని అడివి శేష్.. సోమవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు.
ఈ విషయాన్ని అడివి శేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఇంటికి తిరిగి వచ్చాను.. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. దాంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, అడివి శేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన మేజర్, గూఢచారి-2, హిట్-2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
https://twitter.com/AdiviSesh/status/1442347912910962688?s=20