ఉప్పెనంత స్పందన.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ‘మహాసముద్రం’..!

శర్వానంద్ సిద్ధార్థ్ హీరోలుగా..అను ఇమ్మాన్యూయేల్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మహాసముద్రం. ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ నిన్న విడుదలైంది. ఈ ట్రై లర్  వర్గాలను ఆకట్టుకుంటోంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ ట్రై లర్ 6.3 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని ఔరా అనిపించింది. మామూలుగా ఈ స్థాయిలో వ్యూస్ రావాలంటే స్టార్ హీరోలకే సాధ్యం. కానీ ట్రై లర్  లో కంటెంట్ బాగుండడంతో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.

అలాగే ఈ ట్రై లర్ కు లైక్స్ కూడా భారీగా వస్తున్నాయి. ఇప్పటి వరకూ 185 కే లైక్స్ వచ్చాయి. ఆర్ ఎక్స్ 100 వంటి సినిమా తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించడం, శర్వానంద్, సిద్ధార్థ్ వంటి హీరోలు కలసి నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే ఈ ట్రై లర్ లో అజయ్ భూపతి రాసిన డైలాగ్స్ ఆకట్టు కుంటున్నాయి.’సముద్రం చాలా గొప్పది మామ.. తన రహస్యాలు చాలా దాచుకుంటుంది.. అని శర్వానంద్ చెప్పే డైలాగ్.. నవ్వుతూ కనిపించినంత మాత్రాన బాగున్నట్టు కాదు.. అని అను ఇమ్మాన్యూ యేల్..మీరు చేస్తే నీతి నేను చేస్తే బూతా.. అనే సిద్ధార్థ్ చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.’

అందువల్లే మహా సముద్రం ట్రై లర్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ తో పాటు జగపతి బాబు, రావు రమేష్ పోటీపడి నటించడం కనిపిస్తోంది. ట్రై లర్  కూడా బాగా ఆకట్టుకోవడంతో మహాసముద్రం సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కాగా శర్వానంద్ హీరోగా నటించిన సినిమాల్లో ఈ స్థాయిలో ట్రై లర్ కు వ్యూస్ రావడం ఈ సినిమాకే మొదటి సారి.