న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన `ఆహా కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది వాణీ కపూర్. 2014లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న వాణీ కపూర్.. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయకపోయినా బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాతో బిజీ అయింది.
ఇక ప్రస్తుతం స్టార్ స్టేటస్ను అనుభవిస్తున్న వాణీ కపూర్ ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడిందట. 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని.. ఈ వయసులోనే కుటుంబానికి అండగా నిలబడాలనే నిర్ణయంతో బాధ్యతలన్నీ తానే తీసుకున్నట్లుగా ఇటీవల వాణీకపూర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
పరిస్థితులు మనిషిని ఎలాంటి స్థాయిలోకైనా నెట్టేస్తాయని.. కానీ వాటిని తట్టుకుని నిలబడినప్పుడే జీవితం ముందుకు సాగుతుందని.. ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్లాలని వానీ కపూర్ చెప్పుకొచ్చింది. కాగా, ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్లో రెండు, మూడు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే త్వరలోనే టాలీవుడ్లోకి కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.