పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్స్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్కి జోడీగా నిత్యా మీనన్ నటిస్తోంది.
అయితే ఈ సినిమా టైటిల్ను ప్రకటించకుండానే.. 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని కూడా వదలబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు.
అయితే సినిమా టైటిల్ అనౌన్స్ చేయకుండానే.. షూటింగ్ మొత్తం పూర్తి చేస్తుండడం మరియు పాటలను కూడా విడుదల చేయడం పవన్ కెరీర్లో ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. మరి పవన్ సినిమా నుంచి టైటిల్ ప్రకటన ఎప్పుడు ఉంటుందో చూడాల్సి ఉంది. కాగా, పోలీస్ ఆఫీసర్ – రిటైర్డ్ హవల్దార్ జీవితాల్లో అహం ఆత్మాభిమానం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసున్నాయనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్గా, రానా రిటైర్డ్ హవల్దార్గా కనిపించనున్నారు.