శిల్పా శెట్టి తన భర్తతో విడాకులు తీసుకోవడానికి రెడీ అయిందా..?

బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా పేరు బాగా మార్మోగిపోతోంది.ఇక తన భర్త అశ్లీల చిత్రాలను నిర్మిస్తూ యాప్ ను విడుదల చేస్తున్నారని అభియోగంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గతం నెల 19వ తేదీన రాజ్ కుంద్రాను అరెస్టు చేయడం జరిగింది.ప్రస్తుతం ఈయన కస్టడీలో ఉండడంచేత బెయిల్ కు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈయన పై కేసు మోగడంతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ వివాదం తర్వాత శిల్ప శెట్టి రాజ్ కుంద్రా డబ్బులు ముట్టుకోకూడదు అని భావిస్తున్నట్టుగా సమాచారం.శిల్పా శెట్టి స్నేహితులు తెలిపిన ప్రకారం రాజు కేంద్ర అశ్లీల చిత్రాల నిర్మాణంలో బయటపడడంతో ఈమె ఒక్కసారిగా షాక్కు గురైందం టు చెప్పుకొచ్చారు.

ఇక అంతే కాకుండా ఆయన మోసపూరితంగానే వజ్రాలు డూప్లెక్స్ ఇండ్లు వంటివి సంపాదించారు అన్న సంగతి ఆమెకు తెలియదు అన్నట్లు సమాచారం.ప్రస్తుతం తన భర్త రాజ్ కుంద్రా డబ్బుని తను అసలు ముట్టుకోకూడదు అనే భావనతో తమ పిల్లల రక్షణ కోసం ఆమె సినిమాలలో నటించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక మరొక విషయం ఏమిటంటే ఈ వివాదం తర్వాత వీరు విడాకులు తీసుకోబోతున్నట్లు గా ఎక్కువ గా వినిపిస్తోంది.అయితే అది నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.