ఆర్ ఆర్ ఆర్ మళ్లీ పోస్ట్ పోన్ అయినట్టేనా..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపిస్తుండగా , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో అప్పుడప్పుడు విడుదలైన టీజర్ లు ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందడమే కాకుండా ఇప్పటికీ అధిక వ్యూస్ ను నమోదు చేసుకుంటున్నాయి.

ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా..? అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే జక్కన్న మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వకుండా సైలెంట్ గా ఉండడంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ అనుమానాలకు తెరదించాడు మన జక్కన్న. ఇకపోతే 2022 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా స్టార్ హీరోలైన ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాలు పోటీ పడుతుండడంతో, జక్కన్న వెనుకడుగు వేస్తున్నారని చెప్పాలి.

ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలతో సమానంగా ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా విడుదల చేస్తే ,ప్రేక్షకులు ఏ సినిమా చూడాలి..? ఏ సినిమాను ఆదరించాలి..? అని కన్ఫ్యూజన్ అవుతారు. అందుకే మా సినిమాను ఉగాదికి పోస్ట్ పోన్ చేస్తున్నాం అంటూ ట్విట్టర్ ద్వారా తెలపడం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది చక్కని నిర్ణయం.. చాలా బాగుంది అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా బడా హీరోలను తట్టుకొని మరో బడా హీరో ముందుకెళ్లాలి అంటే జక్కన్న మరికొంత కాలం వేచి ఉండాల్సిందే అని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.