గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలన రేపుతున్న సంగతి తెలిసిందే. పెదకాకాని రోడ్డులో రమ్యను దారుణంగా హత్య చేసిన నిందితుడు శశికృష్ణని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా.. అతడికి వెంటనే ఉరిశిక్ష వేయాలని విద్యార్ధి సంఘాలు, దేశప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే రాజకీయనాయకులు, సెలబ్రెటీలు కూడా రమ్యకు న్యాయం జరగాలని, నిందితుడికి వెంటనే శిక్ష పడాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ లో పలు సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన హీరోయిన్ రేఖ భోజ్ తన ఫేస్ బుక్లో రమ్య హత్య కేసుపై షాకింగ్ పోస్ట్ పెట్టింది. `వాడ్ని(నిందితుడిని) కూడా అలానే ఎవరైనా నరికేస్తే, ఆ నరికిన వాడితో పడుకుంటా.క్షమించండి. ఆ వీడియో చూసాక ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు.
అంత నిస్సహాయతలో వున్నాము మేము ఈ రోజు. జిల్లాకు ఒక సజ్జనార్ సార్ కావాలి. రమ్యా నీకు న్యాయం జరగాలి. నీ ఆత్మకు శాంతి కలగాలి.` అని వ్యాఖ్యలు చేస్తూ తన పోస్ట్ లో ఊసరవెల్లి సినిమాలో తమన్నా తనకు సాయం చేస్తే పడుకుంటా అంటూ ఆవేదనతో చేసిన ఫోటోను జత చేశారు. దాంతో ఈమె పోస్ట్ వైరల్గా మారింది.