రమ్య హత్య కేసులో రోజుకో ట్విస్ట్.. వెలుగు చూస్తోంది..?

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సంచలనంగా మారిన రమ్య హత్య కేసు , దర్యాప్తు జరుపుతున్న సమయంలో రోజుకో ఒక విషయం వెలుగులోకి వస్తున్నాయి. రమ్య హత్య చేసినప్పుడు సీసీ కెమెరా లో ఫోటో చూసి, వీటి ఆధారంగా నిందితుడు శశి క్రిష్ణ , ఆమెను చంపేందుకు పక్కా ప్లానింగ్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. హత్యకు ముందు రోజు అతడు పక్క ప్లానింగ్ చేసి మరీ ఆమెను చంపినట్లు తెలుస్తోంది.

పోలీసులకు తను ఆమెను ఎలా హత్య చేశాడో వివరంగా స్కెచ్ గీసి తెలియజేశాడు. ఈ సంవత్సరం మొదటి నెలలో వీరిద్దరి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. కొద్ది రోజుల వరకు తమ ఇష్టాయిష్టాలు తెలియ చేసుకున్నారు. బాగా స్నేహంగా కూడా మెలిగారు. కొద్దిరోజుల తర్వాత ఆమెకు ప్రపోజ్ చేయడంతో ఆమె నిరాకరించింది. ఇక అప్పటి నుంచి శశి కృష్ణ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అంతే కాకుండా అతని మొబైల్ నెంబర్ ను అలాగే ఇతర సోషల్ మీడియా వంటివి బ్లాక్ లిస్ట్ చేసింది రమ్య.

అంతేకాకుండా రమ్య ఇంటికి వెళ్లి శశి కృష్ణ ఆమెను వేధించేవాడట.

రమ్య ను ఇలా హత్య చేసినట్లు తెలియజేశాడు..
రమ్య తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఆమె మీద కక్ష కట్టి కాలేజీకి వెళ్లే సమయంలో , ఆమెను తన ఫ్రెండ్స్ సహాయంతో కనుక్కొని, బస్సు దిగుతూ ఉన్నప్పుడు.. రమ్య శశి ను చూడడంతో.. ఆమె పరుగులు పెట్టి కాలేజ్ లోపలికి పరుగెత్తింది. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం కూడా తన కాలేజీ దగ్గర కాపు కాసి ఉండటాన్ని గమనించిన రమ్య, తన బస్సు లోనే ఇంటికి వెళ్ళిపోయింది. అలా ఆరోజు తప్పించుకున్న రమ్య,

శశి కృష్ణ తన ఫ్రెండ్స్ తో కత్తి తీసుకొని, రమ్య ఇంటికి వెళ్ళాడు. ఇక ఆ రోజు ఉదయం ఆమె టిఫిన్ కోసం రోడ్డు మీదికి రావడంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు శశి కృష్ణ. ఇక ఆమె చేతిలో ఉన్న మొబైల్ ని లాక్కొని ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె టిఫిన్ ఇంట్లో ఇచ్చేసి మొబైల్ తీసుకుందామని ఉద్దేశంతో , ఇంటికి వెళ్లి తిరిగి వచ్చాక, ఆమె శశి కృష్ణ చేతిలోని మొబైల్ లాక్కొని పరుగెత్తుతుండగా.. ఆమెకు అడ్డుపడి కత్తితో పొడవడం జరిగిందట. ఇలా హత్య చేసిన శశి కృష్ణ ఎక్కడో పొలాలలో దాక్కొని ఉండటాన్ని పోలీసులు గమనించి , మాటు వేసి అతని పట్టుకున్నట్లు సమాచారం.

ఇక అంతే కాకుండా ఈమెపై హత్య చేసిన ఆ వ్యక్తిని ఉరి తీయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నినాదాలు చేస్తున్నారు.