విజయేంద్ర ప్రసాద్ గడ్డంపై వర్మ షాకింగ్ కామెంట్స్‌..జ‌క్క‌న్న‌ను వ‌దల్లేదుగా!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిపై త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లోనే నిలుస్తూనే ఉంటారు. తాజాగా స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ని మ‌రియు ఆయ‌న త‌న‌యుడు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వ‌ర్మ‌. `కనబడుట లేదు` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆర్జీవీ, విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

Ram Gopal Varma stirs up controversy as he lights cigarette instead of a candle | Hindi Movie News - Times of India

అయితే ఈ ఈవెంట్‌కి వ‌ర్మ స్పీచ్ హైలైట్ అని చెప్పాలి. వర్మ మాట్లాడుతూ.. స్టేజ్ కింద ఉన్న వారికి.. స్టేజ్ పైన ఉన్న వారికి అందరికి నమస్కారం పెట్టడం లేదు. ఎందుకంటే నాకు నమస్కారం పెట్టడం నచ్చదు. నాకు ఎవ్వరు నమస్కారం పెట్టకండి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్ర‌మంలోనే అక్క‌డే ఉన్న విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ను ఓ ఆటాడుకున్నాడు వ‌ర్మ‌.

Has Eros International Got SS Rajamouli On Board In Their Joint Venture With KV Vijayendra Prasad?

`చాలా రోజులుగా మిమ్ములను ఒక విషయం అడగాలని అనుకుంటున్నా..మీరు ఆ గడ్డాన్ని ఎందుకు అంతగా పెంచుతున్నారు?.. దానికి నరేంద్ర మోడీ స్పూర్తినా? రామాయణం కంటే గొప్పదైన బాహుబలిని తీశారు అని.. వాల్మీకి కంటే ఎక్కువగా ఉండాలని పెంచుకుంటున్నారా?.. లేదంటే బోడి నా కొడుకు రాజమౌళినే గడ్డం పెంచాడు. నాది అంతకు మించి ఉండాలని పెంచారా..? నాకు తెలిసి అదే అయ్యుంటుంది.. అంటూ న‌వ్వులు పూయించాడు వ‌ర్మ‌. మొత్తానికి ఈయ‌న వ్యాఖ్య‌లు మాత్రం నెట్టింట‌ వైర‌ల్‌గా మారాయి.