బన్నీ, పరశురామ్ సినిమాలో హీరోయిన్ ఆమేనా?

దర్శకుడు పరుశురామ్ గీత గోవిందం సినిమా తో మంచి విజయాన్ని అందుకొని హీరోల దృష్టిని ఆకర్షించాడు. ఇదే ప్రస్తుతం పరుశురామ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంతేకాకుండా మైత్రి మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది అంటే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమా తరువాత అక్కినేని నాగ చైతన్య తో ముందుగా అనుకున్న విధంగానే ఒక సినిమాను తీయబోతున్నాడట. ఆ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కించే దిశగా అడుగులు వేయబోతున్న ట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాను బన్నీ హోమ్ బేనర్ గీతా ఆర్ట్స్ నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట రకుల్ అలాగే రష్మికా ని అనుకోగా చివరికి రకుల్ ప్రీత్ సింగ్ ని ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ విషయం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.