పాన్ ఇండియా హీరోయిన్ సక్సెస్ మంత్రం ఇదేనా..?

ఇటీవల ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా సినిమాలు కోసమే నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక స్టార్ హీరోలను మొదలు పెట్టుకుని , ఇటీవలే సినిమాల ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన యంగ్ హీరోల వరకు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఒక్క సినిమా చేస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందవచ్చు కాబట్టి. ఇక హీరోల బాటలోనే హీరోయిన్లు కూడా నడుస్తున్నారు.

ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లు పాన్ ఇండియా వైపు వెళ్లాలని అనుకుంటూనే ,పాన్ ఇండియా స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. అలాంటి వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు. ఈమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలలో నటిస్తోంది. అయితే ఆమె పాన్ ఇండియా మూవీ లో నటించడానికి వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో చెప్పేసింది.

మొదట్లో పూజా హెగ్డే సినీ జీవితం సాధారణంగానే మొదలైంది. తమిళంలో వచ్చిన మూగ మూడి అనే సినిమాతో ఓకే పర్వాలేదు అనిపించుకుని, తెలుగులో ఒక లైలా కోసం సినిమా లో ,ముకుంద సినిమాలో నటించింది .అయితే ఈ సినిమాలు ఈమెకు కలిసి రాలేదు. ఇక బాలీవుడ్ కు మకాం మార్చి ,మొహంజదారో సినిమా చేసింది. ఇక అక్కడ కూడా ఆమెను అదృష్టం వరించలేదు. తిరిగి అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి, మంచి హిట్ ను అందుకుంది. స్టార్ హీరోయిన్ గా తన జీవితాన్ని ఒక పై స్థాయిలో ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయింది పూజా హెగ్డే..

ఈ క్రమంలోనే ఈమె ఆలోచన విధానం ఎలా ఉండేదో ఇటీవల మనతో చెప్పుకొచ్చింది.. ఈమె చెప్పిన విషయం ఏమిటంటే, ఫలితం గురించి ఆలోచించకండి.. బాగా పనిచేస్తే మంచి అవకాశాలు వస్తాయి. అప్పుడు మనం ఊహించని స్థాయికి చేరుకోవచ్చు. ఈ నినాదాన్ని నమ్ముకున్నాను.. అంటూ చెప్పింది. అందుకే పూజ స్టార్ గా మారి ప్రస్తుతం రాధే శ్యామ్, సర్కస్, బీస్ట్ అనే సినిమాలతో బిజీగా ఉంటోంది.